హీరోగా రామ్ పోతినేనినీ, దర్శకుడిగా పూరీ జగన్నాథ్నీ సక్సెస్ ట్రాకెక్కించిన బ్లాక్బాస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’. ఆ సినిమా సీక్వెల్గా రానున్న సినిమా ‘డబుల్ ఇస్టార్ట్’. పేరుకు తగ్గట్టే ఇందులో రెట్టింపు యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ శనివారం ముంబైలో మొదలైంది. ఈ కీలకమైన భారీ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు మేకర్స్ తెలిపారు.
ఈ షెడ్యూల్తో మేజర్ పార్ట్ పూర్తవుతుందని వారు పేర్కొన్నారు. పూరీ జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకోసం రామ్ పోతినేని ైస్టెలిష్ మేకోవర్ అయ్యారనీ, సంజయ్దత్ ఇందులో పవర్ఫుల్ కేరక్టర్ చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమానికి కెమెరా: శ్యామ్ కె.నాయుడు, జియాని జియోనెలీ, నిర్మాణం: పూరీ కనెక్ట్స్, నిర్మాతలు: పూరీజగన్నాథ్, ఛార్మి కౌర్.