వరంగల్ : నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రకాళీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారు జాము నుంచే భక్తులు భద్రకాళీ ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆయల క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పౌర్ణమి రావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు భద్రకాళీ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్- వాణి దంపతుల పెళ్లి రోజును పురస్కరించుకోని భద్రకాళీ అలయాన్ని సందర్శించారు.
ఆలయ ఈవో శేషుభారతి ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే దంపతులు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి అలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. ఎమ్మెల్యే దంపతులతో పాటు కార్పొరేటర్లు పోశాల పద్మ స్వామి, పల్లం పద్మరవి, గందె కల్పన నవీన్, ముష్కమల్ల అరుణ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న గ్రేటర్ కమిషనర్
కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయమే కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఆలయాన్ని సందర్శించారు. అనంతరం అలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందచేశారు.