ఖిలావరంగల్: బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు రోజులుగా జరుగుతున్న అటల్ ఏఐసీటీఈ, ఉపాధ్యాయ శిక్షణా తరగతులు శుక్రవారం ముగిశాయి. వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల, ఏఐసీటీఈ న్యూఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన శిక్షణా తరగతులను డీన్, ప్రొఫెసర్ ఎస్ఎస్వీఎన్ శర్మ ప్రారంభించారు. అనంతరం ఐఓటీ ఫండమెంటల్స్ అను అంశంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ సీహెచ్ దేవేందర్రెడ్డి, ఏఓ సత్యపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రకాష్, స్మార్ట్ బ్రిడ్జి కంపెనీకి ప్రతినిధి తులసి, కన్వీనర్ డాక్టర్ బీ కృష్ణ, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.