PM Modi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని (Rahul Gandhi) ప్రధానిని చేసేందుకు పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) తహతహలాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. రాహుల్పై పాక్ మాజీ మంత్రి ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో మోదీ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లోని ఆనంద్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. హస్తం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలహీనపడుతుంటే.. అక్కడ పాకిస్థానీయులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ యువరాజుని (రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) భారత ప్రధానిని చేయాలని పాక్ నేతలు తహతహలాడుతున్నారన్నారని ఆరోపించారు. రాహుల్ కోసం పాక్ నేతలు ప్రార్థిస్తున్నారని వ్యాఖ్యానించారు. దాయాదిదేశం పాకిస్థాన్కు కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న బంధం ఇప్పుడు పూర్తిగా బట్టబయలైందని మోదీ పేర్కొన్నారు.
కాగా, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై పాకిస్థాన్ మాజీ మంత్రి సీహెచ్ ఫవాద్ హుస్సేన్ (Fawad Ahmed Hussain Chaudhry) పొగడ్తలు వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రాహుల్ మంచి ఫైర్ మీదున్నాడంటూ రాసుకొచ్చారు. దీనిపై తాజాగా ప్రధాని మోదీ పై విధంగా స్పందించారు.
Also Read..
Sunita Kejriwal | ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా చేశారు : సునీతా కేజ్రీవాల్
Amitabh Bachchan | టీ20 వరల్డ్ కప్ భారత జట్టుకు అమితాబ్ స్పెషల్ మెసేజ్.. ఇది మహా యుద్ధం అంటూ..
Brij Bhushan | బ్రిజ్ భూషణ్కు బీజేపీ షాక్.. కైసర్గంజ్ నుంచి ఆయన కుమారుడికి అవకాశం..!