మెదక్ : మెదక్ బీఆర్ఎస్(BRS) పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి(Venkatrami Reddy) గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. గురువారం మెదక్(Medak) జిల్లా నిజాంపేట మండలం చెలిమెడ గ్రామానికి చెందిన ముదిరాజ్ సోదరులు హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన బండారాన్ని బయటపెట్టాలి.
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్, తెలంగాణకు మొండిచెయ్యి చూపించిన బీజేపీ గురించి ఇంటింటా ప్రచారం చేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజల పోరాడుతుం దన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.