కరీమాబాద్ : బీజేపీ దేశంలో రైతులను కాల్చి చంపుతుంటే… రాష్ట్రంలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కేంద్రం తెలంగాణలో పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పిలుపులో భాగంగా శుక్రవారం నాయుడుపంపు జంక్షన్లో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కాబట్టి రైతుల కష్టాలు తెలుసన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అన్నారు.
రైతులకు అండగా ఉంటూ రైతుల గళాన్ని కేంద్రానికి వినిపంచేలా ధర్నా చేపడుతున్నారన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆపి తెలంగాణలో రైతులను రాజును చేయాలనే కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. నీళ్లు.. నిధులు.. నియామకాలు అనే నినాదంతో ఉద్యమించి ఆ దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. అందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని ఆయన పేర్కొన్నారు. ఖిలావరంగల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంది.
కేంద్రం రైతుల నడ్డివిరుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో రైతులు బాగుపడుతున్నారు. కార్పొరేటర్ పోశాల పద్మ మాట్లాడుతూ ధరలను పెంచుతూ సామాన్యులను.. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను కేంద్రం దగా చేస్తుందన్నారు. కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల కోసం చేపట్టిన పథకాలు.. కేంద్రం చేస్తున్న మోసాలను ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమంలో పలు చైర్మన్లు, కార్పొరేటర్లు, పలు సంఘాల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.