గీసుగొండ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ జాన్పాకలో శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 40 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసిపి రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు. నర్సంపేటకు చెందిన ఇఫ్రాన్ ఓఅద్దె నివాసంలో ఉంటూ, తన ఆటోలో చూట్టు పక్కల ప్రాంతాల వారి నుంచి తక్కువ ధరకు రేషన్బియ్యం కొనుగోలు చేస్తూ అధిక ధరకు విక్రయించేందుకు భారీ మొత్తంలో సుమారు 40 క్వింటాళ్ల బియ్యంను ఇంట్లో నిల్వ చేశాడు.
పోలీసులకు సమాచారం రావటంతో ఇంటిపై దాడులు చేసి ఇంటిలో నిల్వ చేసిన 40 క్వింటాళ్ల బియ్యంను పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యం విలువ రూ. 92 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేయాలని గీసుగొండ పోలీసులకు అప్పగించామన్నారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్, సంతోశ్, సిబ్బంది పాల్గొన్నారు.