మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 27 : కేసీఆర్ ప్రభుత్వ పాలనలోనే పేదలకు లబ్ధి జరిగిందని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. శనివారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జిల్లా నాయకులతో కలిసి ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, ఎన్నికల తర్వాత వాటి అమలును విస్మరించిందన్నారు. దళితులు, లంబాడాలు, ఆదివాసులకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని అమలు చేసి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ఉండి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ నేతృత్వంలో అనేక పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందాయన్నారు. అనేక పథకాలతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు అనేక మాయమాటలు చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లు వేశారని, ఇప్పుడు ఎందుకు ఓట్లు వేశామా అని బాధపడుతున్నట్లు చెప్పారు. మళ్లీ ప్రజల చూపు కేసీఆర్వైపే ఉందని, పేదల సమస్యలను పరిష్కరించేది కేసీఆర్ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు మహబూబ్ పాషా, భరత్కుమార్రెడ్డి, ఎండీ ఫరీద్, గద్దె రవి, గోకుల రాజు, బానోత్ రవి కుమార్, ఎడ్ల వేణు, జేరిపోతుల వెంకన్న, బూర్ల ప్రభాకర్, మందుల రఘు, పొన్నాల యుగేంధర్, రాము రావిష్, కిరణ్, శంకర్, నీలేశ్ పాల్గొన్నారు.