వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా 43 వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి ఈదురు అరుణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మనకు వరదలు వచ్చినపుడు, కరోనా వచ్చినపుడు ప్రజలను పట్టించుకోని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికలు రాగానే ఓట్లకోసం అన్ని పార్టీల వాళ్లు వస్తారు.
కానీ ఎవరికీ ఓటు వేస్తే మన జీవితాలు బాగుపడతాయి అనేది ఆలోచించి ఓటు వేయాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తుందన్నారు. అభివృద్ధిని చూసి అరుణను నిండు మనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
నేలకొరిగిన సాహితీ శిఖరం : మంత్రి జగదీష్ రెడ్డి
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
వేములవాడలో కరోనాతో అర్చకుడి మృతి
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం