హైదరాబాద్ : ప్రముఖ పద్య కవి తిరునగరి మృతితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాహితీ శిఖరం నెలకొరిగినట్లైందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దాశరథి అవార్డు గ్రహిత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. సంప్రదాయ సంస్కారాన్ని ఆధునిక విలువలను మేళవించి పద్యాన్ని వచన కవితను సమ ఉజ్జిగా పండించిన తిరునగరి కవితా ధార గొప్పదన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి జిల్లాలో సాహిత్య సేవ రికార్డు ఎప్పటికీ పదిలంగా ఉంటుందన్నారు. సాహిత్య లోకానికి ఆయన మరణం తీరని లోటు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
వేములవాడలో కరోనాతో అర్చకుడి మృతి
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం
ఢిల్లీలో అందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్