నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం రాంపూర్లో ఆదివాసులు ( Adivasis ) అకాడి పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. గ్రామ సమీపంలోని శివారులో వన దేవత ( Forest Goddess ) కు సాంప్రదాయ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పశువులకు కొత్తగా చిగురించిన మేతను తినిపించారు.
వర్షాలు సమృద్ధిగా కురువాలని , పంట దిగుబడి రావాలని, మూగజీవాలకు, పశు కాపర్లకు విష జంతువుల నుంచి ఎలాంటి హాని కలుగకుండా రక్షణ కల్పించాలని వన దేవతకు వేడుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ హెచ్ కె జంగు పటేల్, దేవారి రూప్ దేవ్, జగ్గేరావు, సీతారాం, దేవ్ రావు, పాండు, దాది రావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.