KTR | హైదరాబాద్లోని బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
అదే విధంగా తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం స్కూల్లో విద్యార్థులతో కలిసి కేటీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 16 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పీవీ నరసింహారావు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు.
ఆయన చూపిన మార్గంలో నడుస్తూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు హైదరాబాద్లోని బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ను సందర్శించి, విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
అలాగే తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని… pic.twitter.com/Pt2hPtsNk7
— BRS Party (@BRSparty) June 18, 2026
Uttar Pradesh | బ్యాంక్ లాకర్లో పెట్టిన 96 గోల్డ్ ప్యాకెట్లు మాయం.. యూపీలో ఘటన
Batwara 1947 | దేశ విభజన నేపథ్యంలో సన్నీ డియోల్ ‘బట్వారా 1947’.. ఆసక్తికరంగా టీజర్!