హనుమకొండ, మే 3 : ‘ఈజీఎస్ పథకం అమలు లో వాస్తవాలు చర్చిద్దామా..?, ఇందులో ఎవరి బాధ్య త
ఎంత?.., కేంద్రంలో లోటుపాట్లుంటే రాష్ట్రప్రభుత్వాన్ని తిట్టడమేంటి.., బండి సంజయ్కి కనీస
అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా.., దమ్ముంటే చర్చకు రావాలి’ అని రాష్ట్ర పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశా రు. మంగళవారం ఆయన
హనుమకొండ ఆర్అండ్ బీ గెస్ట్హౌస్లో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి
దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి నిర్వహించిన విలేకరుల
సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుల తీరుపై మండిపడ్డారు. మహబూబ్నగర్లో ప్రజాసంగ్రామ
యాత్ర చేపట్టిన బండి సంజయ్ ఉపాధి హామీ పథకంపై కనీస అవగాహన లేకుండా పచ్చి
అబద్ధాలు మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అంటేనే బడా ఝూటా పార్టీ అని, పథకం
అమలులో లోటుపాట్లపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడమేంటన్నారు.
ఉపాధి పథకం కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉందని, రాష్ట్రప్రభుత్వానిది ఎలా బాధ్యత అవుతుందని
ప్రశ్నించారు. మూడు నెలలుగా కూలీలకు డబ్బులుఅందడం లేదని, ఈ విషయంలో కూడా తప్పుడు
ప్రచారం చేస్తున్నారని అన్నారు. జీహెచ్ఎంసీఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల్లోఒక్కటై నా నెరవేర్చారా అని ప్రశ్నించారు. బండిసంజయ్ మొదటి నుంచి అబద్ధాలే మాట్లాడుతున్నాడని, ఆయనకు ప్రజా సమస్యలపైకనీస అవగాహన లేదన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉపాధి పథకం ఎలా ఉంది..?,తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందో కేంద్రం ఇచ్చే
నివేదికలు చూడాలని హితవు పలికారు. కేంద్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులు దేశంలో ఎక్కడాలేని
విధంగా తెలంగాణలో ఈజీఎస్ పథకం అమలవుతుందని, ప్రజల అవసరాలకు ఉపయోగపడే పనులకు మాత్రమే ఈజీఎస్ నిధులు వినియోగిస్తున్నారని నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అలాగే, పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం కూడా తన నివేదికలో పేర్కొన్నదని చెప్పారు. ఇటీవల దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే, అందులో 19 తెలంగాణ
రాష్ర్టానివేనన్నారు. ఓడీఎఫ్తో పాటు అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఆడిట్ పూర్తి చేసి రాష్ట్రం
మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పటికి లేబర్ కాంపోనెంట్కు సంబంధించి రూ.230 కోట్లు కేంద్ర
ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్రమే అనేక అవార్డులు
ఇస్తుందని మంత్రి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో మొదటి
స్థానంలో నిలిచిందన్నారు.
టోల్గేట్ల వద్ద చార్జీలు,గ్యాస్, డీజిల్, పెట్రో ల్ ధరలు కేంద్రం పెంచడంతోనే ఆర్టీసీ చార్జీలు పెంచినట్లు చెప్పారు. ఫ్లోరైడ్ రహితరాష్ట్రంగా తెలంగాణ మా రిందని పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రస్తావించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇంటింటికీ భగీరథ నీళ్లు అందుతున్నాయని, పల్లెప్రగతి ద్వారా విషజ్వరాలు తగ్గాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి న్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఉపాధి హామీ పథకంలో అనేక అవకతవకలు జరిగాయని,ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని దినాలు,నిధులు తగ్గించిందని మండిపడ్డారు. ఉపాధిపథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ అనేక సార్లు కేంద్ర ప్ర భుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. అభినందించకున్నా,సహకరించకున్నా ఫర్వాలేదు.. కానీ, అబద్ధాలుమాట్లాడకండి అని మంత్రి ఎర్రబెల్లి హితవు పలికారు.