కొడకండ్ల, మే 9: బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సుధీర్కుమార్ను గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లు అమలు చేయకుండా, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్, బీజేపీలకు ప్రజలు ఓటుతో తగి న బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గురువారం జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని రేగుల, రంగాపురం, ఏడునూతుల, నర్సింగాపురం ఎంపీటీసీ క్లస్టర్లలో పార్టీ మండల అధ్యక్షుడు సిందే రామోజీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పాలన తలాతోక లేని విధంగా ఉన్నదని, మోసపూరిత హామీలు 420 ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను ఆగం చేస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో కరెంటు లేక రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే మనం కేసీఆర్కు బలం చేకూర్చే విధంగా బీఆర్ఎస్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఏడునూతుల గ్రామానికి చెందిన నాయకులతో కలిసి దయాకర్రావు మిర్చి కాల్చి ఓట్లు అభ్యర్థించారు. అదేవిధంగా ఏడునూతుల గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్స్ చెన్నబోయిన యాకయ్య, మద్దెబోయిన కుమార్ వారం రోజుల వ్యవధిలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీఎస్ఈజీసీ సభ్యుడు అందె యాకయ్య, ఏఎంసీ చైర్మన్ పేరం రాము, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, జడ్పీటీసీ కేలోత్ సత్తెమ్మ, పార్టీ ఉపాధ్యక్షుడు ఎండీ ఆసిఫ్, వైస్ ఎంపీపీ వీరసోములు, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు దేశగాని సతీశ్, సొసైటీ వైస్చైర్మన్ మేటి సోమరాములు, పార్టీ నాయకులు బాకీ ప్రేమ్కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్యా మంగ్యానాయక్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ బాబర్, కప్పల శ్రీనివాస్, ఎలిట్టె సోమన్న, పనస రాజు, కుంచం హరీశ్, మహ్మద్ షన్నా, ముత్యం మధు పాల్గొన్నారు.