వరంగల్ : కొవిడ్ నియమాలను పాటిస్తూ గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గణేష్ మండపాల నిర్వాహకులకు పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రులను దృష్టిలో పెట్టుకోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రుల
ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ గణేష్ నవరాత్రి మండపాల నిర్వహకులకు పలు సూచనలు చేస్తూ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసారు.
ముఖ్యంగా నవరాత్రి మండపాలను ఏర్పాటు చేయదలుచుకున్న నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న http:// policeportal.tspolice.gov.in/ index.htm వెబ్ సైట్ ద్వారా మండపాల నిర్వాహకులు పూర్తి వివరాలను నమోదు చేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు అన్లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని పేర్కొన్నారు.
నూతనంగా నెలకొల్పబడే మండపాలకు అనుమతులు ఇవ్వబడదని సీపీ తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకుగా పోలీస్ కమిషనర్ మండప నిర్వహకులకు పలుసూచనలు చేసారు.