కేసముద్రం, మే 6: కేసముద్రం వ్యవసా య మారెట్లో ఆరుబయట ధాన్యం, మకజొన్నలను కొనుగోలు చేయడం లేదని రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. యాసంగిలో సాగుచేసిన మకజొన్న, ధాన్యం చేతికొస్తుండడంతో విక్రయానికి తీసుకువస్తున్నారు. మారెట్లోని షెడ్లలో, ఆరు బయట మకజొన్న, ధాన్యాన్ని రాశులుగా పోశారు. అయితే, వ్యాపారులు షెడ్డులో ఉన్న ఉత్పత్తులకే ఈ -నామ్ టెండర్ వేశారు. మిగిలిన వాటికి టెండర్ వేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు మారెట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వాతావరణం సరిగ్గా లేనందున ఆరు బయట ఉన్న వాటిని ముందుగా కొనుగోలు చేయాల్సిన వ్యాపారులు, అందుకు విరుద్ధంగా షెడ్లలో ఉన్న వాటిని కొనుగోలు చేయడమేంటని ప్రశ్నించారు. కొనుగోలు చేసిన మకజొన్న, ధా న్యంలో కూడా ఒకటి రెండు రాశులకు ఎకు వ ధర పెట్టి మిగిలిన వాటికి తకువ ధరలు కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మారెట్ కార్యదర్శి అమరలింగేశ్వరరావు వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేపు మొదటగా ఆరుబయట ధాన్యానికి టెండర్ వేయిస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు.