హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆకాశవాణి, దూరదర్శన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ వాణీదేవి తన వాణిని వినిపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆమె వివరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ ఆకాశావాణి, దూరదర్శన్లో ఉచితంగా స్లాట్లను కేటాయిస్తుంది.
దీనిలో భాగంగా బీఆర్ఎస్ తరఫున ఆమెకు ప్రసంగించే అవకాశాన్ని కల్పించారు. పరిశ్రమలు, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా విజయాలను ఆమె వివరించారు. రాష్ర్టానికి టీఎస్ఐపాస్ విధానం ప్రపంచంలో గుర్తింపు పొందిందని తెలిపారు. తెలంగాణ వాణిని పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ ప్రతినిధులు అధిక సంఖ్యలో ఉండాలని ఆమె కోరారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటు వేయాలని వాణీదేవి ఈ సందర్భంగా కోరారు.