న్యూశాయంపేట, మే 6 : అరూరి, కడియం ద్రోహులని, తాను నిఖార్సైన తెలంగాణ ఉద్యమ బిడ్డను అని బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ అన్నారు. సోమవారం హంటర్రోడ్ డీ కన్వెన్షన్ హాల్లో వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన గ్రేటర్ వరంగల్ పలు డివిజన్ల బీఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ ఆధ్వర్యంలో నిర్వహించా రు. ఈ సందర్భంగా సుధీర్కుమార్ మాట్లాడుతూ పదేళ్లు పదవులు అనుభవించిన అరూరి, కడియం వరంగల్ ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురిచేశారో అందరికీ తెలుసన్నారు. పార్టీని మోసం చేసిన వ్యక్తులకు ఈ ఎన్నిక గుణపాఠం కావాలన్నారు. పోలీసులు అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకువెళ్లి వారిపై చర్యలు తీసుకునేలా చూస్తానన్నారు. కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించాలని, తన గెలుపు వరంగల్లో చారిత్రాత్మకంగా నిలిచిపోవాలన్నారు. ఒక కుచేలుడికి పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం అందరి ఆశీర్వాదంతో వస్తుందన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి, టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్, ఆవాల రాధికారెడ్డి, రైతుబంధు సమితి మాజీ కన్వీనర్ లలితాయాదవ్ పాల్గొన్నారు.
హసన్పర్తి : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ గెలుపు ఖాయమని 65వ డివిజన్ కార్పొరేటర్ గుగులోత్ దివ్యారాణీ రాజునాయక్ అన్నారు. చింతగట్టులో బీఆర్ఎస్ గెలుపుకోసం ఆమె ఇంటింటా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగరాజు, సాగర్, రాజేంద్రప్రసాద్, రమేశ్, బీఆర్ఎస్ శేణులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ : బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ను గెలిపించాలని కోరుతూ 37వ డివిజన్లో విస్తృతంగా ప్రచారం చేశారు. తూర్పుకోట, మధ్యకోట, మైనార్టీ కాలనీ, పడమరకోట, జంగాల కాలనీ, గిరిప్రసాద్ నగర్, ఎంఎంనగర్లో ఇంటింటా తిరిగారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సువర్ణా సురేశ్, మాజీ కార్పొరేటర్ బిల్లా కవితా శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షుడు విజయ్, ధర్మరాజు, శ్రీధర్రెడ్డి, ఉమేశ్, అరుణ్, వాసుదేవ్, సతీశ్, రమాదేవి, ఎల్లయ్య, నవీన్, సన్నీ పాల్గొన్నారు.
కాశీబుగ్గ : కాశీబుగ్గ 19వ డివిజన్లోని 74, 75, 76, 77వ బూత్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరి రాజశేఖర్, క్యాతం రంజిత్, బానోత్ కిరణ్నాయక్, కిశోర్, రాజు, నోముల మహేందర్, మల్లయ్య, సమ్మక్క, సరోజన, వినమల, అభిషేక్, చిరంజీవి, హరీశ్, పాపయ్య, రాజ్ కిరణ్, బాలు, వరుణ్ పాల్గొన్నారు.
వర్ధన్నపేట : బీఆర్ఎస్ నాయకులు పట్టణ సమీపంలోని పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీల వద్దకు వెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అలాగే మండలంలోని దమ్మన్నపేటలో మాజీ ఎంపీపీ నూనె భిక్షపతి ఆధ్వర్యంలో ఉపాధి కూలీలను ఓటు వేయాలని కోరారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుమారస్వామి, పట్టణానికి చెందిన నాయకులు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.
ఐనవోలు : మండలంలోని ఐనవోలు, పున్నేల్, పెరుమాండ్లగూడెం, కొండపర్తి, వనమాలకనపర్తి, ముల్కలగూడెం, పంథిని, నందనం, లింగమోరిగూ డెం గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. మండల కేంద్రంలో ఉపాధిహామీ కూలీల దగ్గరకు వెళ్లి ఓటు అభ్యర్థించారు. జడ్పీ కోఆప్షన్ ఉస్మాన్అలీ, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, ఎంపీటీసీ సోమేశ్వర్రావు, మండల నాయకులు పట్టాపురం ఎల్లగౌడ్, తాటికాయల కుమార్, కాటబోయిన అశోక్, దేవదాసు, సుదర్శన్, కుమార్, రాజు, చందర్, రాజు, రమేశ్, పుష్ప, బాబు పాల్గొన్నారు.