న్యూఢిల్లీ, మే 6: లోక్సభ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న వేళ మోదీ సర్కార్పై బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ క్యాబినెట్లో ఇద్దరు (రాజ్నాథ్, గడ్కరీ) తప్ప.. మిగతా వారంతా ‘యెస్’ అంటూ తలూపేవారేనని విమర్శించారు. లఢక్లో నెలకొన్న పరిస్థితిపై కేంద్రం నిజాయితీగా లేదన్నారు.
ఎన్నికల బాండ్ల పథకం అతిపెద్ద కుంభోణమని, దీని నుంచి ప్రధాని మోదీ తప్పించుకోలేరని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుబ్రమణ్య స్వామి పై వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కార్ క్యాబినెట్ మంత్రులపై మాట్లాడుతూ, ‘వారికి మంత్రులు అయ్యే అర్హతల్లేవు. రాజ్నాథ్, గడ్కరీ తప్ప, క్యాబినెట్లో మిగతావారంతా వెన్నెముక లేనివారే. అలాంటి వారినే మోదీ ఎంచుకున్నారు’ అని స్వామి అన్నారు.