KTR | రాజన్న సిరిసిల్ల, జూలై 27( నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుచేసుకున్నారు. ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్కు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా ల్యాప్టాప్ను బహూకరించారు. కాలేజీ ఫీజును కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్ తన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, శ్రీలతతో కలిసి హైదరాబాద్లో కేటీఆర్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన అభినవ్ను కేటీఆర్ శాలువాతో సత్కరించారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద ల్యాప్టాప్ అందజేశారు. అంతేకాకుండా అభినవ్ కాలేజీ ఫీజును కూడా తానే చెల్లిస్తానని భరోసా ఇచ్చారు.
కేవలం చదువు మీద దృష్టి పెట్టి.. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభినవ్కు కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా కేటీఆర్కు అభినవ్, అతని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువబోమని, కేటీఆర్కు రుణపడి ఉంటామని అన్నారు.