Dharmendra Pradhan | నీట్ పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థి నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీలు ఆయనను సన్మానించారు. ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.
ప్రధాన్ రాకకు ముందే పలువురు బీజేపీ, ఎన్డీఏ ఎంపీలు పార్లమెంటు ప్రవేశ ద్వారం వద్ద గుమిగూడారు. ఆయన పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశిస్తుండగా, వారు ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ నినాదాలు చేస్తూ ఆయనకు తోడ్కొని వెళ్లి, లాంఛనప్రాయంగా టోపీని బహూకరించారు. రాజీనామా చేసిన రెండు రోజులకే ఈ భారీ సంఘీభావ ప్రదర్శన జరగటం విశేషం. కాగా, బీజేపీ ఎంపీల తీరుపై సమాజిక మాద్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజీనామా అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ధర్మేంద్ర ప్రధాన్ను సన్మానించిన బీజేపీ ఎంపీలు
ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు https://t.co/QttSWd7rgU pic.twitter.com/UZgVJEAEz3
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026