న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 31న అరెస్ట్ చేసింది.
ఈ అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. దీనిపై ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీలు చేశారు. హేమంత్ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.