US Tariff Bill | రష్యా, ఇరాన్లపై ఆంక్షల బిల్లును అమెరికా సెనెట్లో ప్రవేశ పెట్టారు. ఆ దేశాల నుంచి చమురు, గ్యాస్ను కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం సుంకాలు విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. దివంగత నెటర్ లిండ్సే గ్రాహం ఈ బిల్లును రూపొందించారు. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై ఆంక్షలు, ఇరాన్పై జరిమానాలు విధించడమే ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లుకు సెనెట్లో 86 ఓట్లు అనుకూలంగా, 12 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో బిల్లును ఆ దేశ మద్దతు కోరుతున్న అమెరికా సెనెట్లో ప్రవేశపెట్టడం గమనార్హం. ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణను లిండ్సే గ్రాహం వ్యతిరేకించారు. ఆయనకు నివాళిగా ఈ బిల్లును సెనెట్లో ప్రవేశ పెట్టారు. అందుకే ఈ బిల్లుకు లిండ్సే గ్రాహమ్ (Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026) పేరు పెట్టారు.
ఇంధన ఎగుమతుల ద్వారా రష్యా ఆర్జిస్తున్న ఆదాయాన్ని కట్టడి చేసేందుకు, ఇరాన్పై చర్యలు తీసుకునేందుకు ట్రంప్నకు అవకాశం ఈ బిల్లు కల్పిస్తుంది. ప్రతినిధుల సభ (House of Representatives) కూడా ఆమోదిస్తే ఈ బిల్లు చట్టంగా మారుతుంది. అదే జరిగితే భారత్, చైనాతో సహా ప్రధాన దేశాలు వంద శాతం టారిఫ్ను ఎదుర్కోవాల్సి
ఉంటుంది. ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంకాలు విధిస్తారు.