తిరుమల : భక్తగ్రేసరుడు, నిత్యకల్యాణుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు ( Compartments ) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు ( TTD ) వివరించారు.
మంగళవారం 78,709 మంది భక్తులు దర్శించుకోగా 31,312 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.76 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. హైదరాబాద్కు చెందిన వెంకట గణేష్ గంగాధర్ దాసిక అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.