Jayesh Ranjan | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగం అభివృద్ధిలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు. ఇటీవలే కొత్తగా ఎన్నికైన హైసియా కార్యవర్గ సభ్యులతో టీ-హబ్లో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మౌలిక వసతులు, ప్రణాళికలపై ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకు రావాలని సూచించారు. సమావేశంలో హైసియా అధ్యక్షుడు ప్రశాంత్ నాదెండ్ల, ఉపాధ్యక్షుడు బిపిన్ పెండ్యాల, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.