వరంగల్ : పిల్లలు ఆనందంగా ఉంటే అదే అసలైన పండుగ అని లీగల్ మెట్రాలజీ డిస్ట్రిక్ ఇన్స్పెక్టర్ రియాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం పద్మావతి గార్డెన్స్లో శ్రీ సింహాద్రి లక్ష్మినరసింహ ఫైర్వర్క్స్ యజమాని తాటికొండ రాము ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మల్లికాంబ మనోవికాస కేంద్రంలోని పిల్లలకు బాణాసంచా పంపిణీ చేశారు. మానసికంగా వారిని ఆనందంగా ఉంచడం వల్ల మార్పు వస్తుందని గుర్తించి వారికి ప్రతి సంవత్సరం ఉచితంగా బాణాసంచాను అందించడం అభినందించాల్సిన విషయమని అన్నారు.
అనంతరం తాటికొండ రాము మాట్లాడుతూ బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలు సైతం దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వారికి ఉచితంగా బాణాసంచా అందిస్తున్నామన్నారు. పిల్లలకు ఉచితంగా బాణాసంచా అందించినందుకు మనోవికాస కేంద్రం నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.