పెద్దవంగర(తొర్రూరు), మే2: బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ అని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నాంచారిమడూ ర్, వెలికట్ట, భూక్యా తండా, పెద్దమంగ్యాతండా, టీక్యాతండా, చింతలప ల్లి, కొమ్మనపల్లితండా, హచ్చుతండా, గుర్తూరు, కంఠాయపాలెం, ఫతేపురం, పోలెపల్లి, మాటేడు, చెర్లపాలెం, గోపాలగిరి, చీకటాయపాలెం, హరిపిరాల, కరా ల, వెంకటాపురం, అమర్సింగ్తండా, దుబ్బతండా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారితో కలిసి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగా ణ ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 8 నుంచి 10 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చా రు. ఒక ఉద్యమకారుడికి ఇద్దరు మోసగాళ్లకు మధ్య జరిగే ఈ ఎన్నికలో తెలంగాణ హకులు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ కి చేసిన మోసానికి శాశ్వతంగా తన రాజకీయ సమాధి తప్పదన్నారు.
బీజేపీలో చేరిన అరూరి రమేశ్ వర్ధన్నపేట ప్రజలను మోసం చేసిండని, మోసం చేసిన వాళ్లకు ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవే రాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సీతారాములు, ఎంపీపీ చిన్న అంజ య్య, జడ్పీటీసీ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకు లు సోమేశ్వర్రావు, ఆయా గ్రా మాల ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నా యకులు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.