నర్సంపేట, ఫిబ్రవరి 3 : కేంద్ర ప్రభుత్వం గిరిజనులను చిన్నచూపు చూస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రథోడ్ అన్నారు. గురువారం ఆమె వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గిరిజన రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గిరిజనులకు రూ.12,304 కోట్లు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.8,400 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. దీనిని బట్టి చూస్తే గిరిజనులపై బీజేపీ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నదని అన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా గిరిజనులకు కేజీ టు పీజీ విద్య అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేని తెలిపారు. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ, పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విదేశాల్లో చదువుకునేందుకు ప్రపంచ వ్యాప్తం గా 23 యూనివర్సిటీల్లో అవకాశం కల్పించారని అన్నా రు. అంతేకాకుండా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సిస్ పథకం ద్వారా రూ.20 లక్షలు స్కాలర్షిప్ ఇస్తున్నట్లు మంత్రి వివరించారు.
డిగ్రీలో విద్యార్థినులకు గురుకులా లు లేక చదువు మానేస్తున్నారని గుర్తించిన కేసీఆర్ ఒకే రోజు 23 మహిళా గురుకులాలను మంజూరు చేశారని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖకు సైనిక్స్కూల్ కూడా ఉందని గుర్తు చేశారు. వీటితో పాటు ఇంటిగ్రేటేడ్ లా కా లేజీ, పీజీ కెమిస్ట్రీ, ఇంటీరియల్ డిజైన్, ఫొటోగ్రఫీ, ఫైన్ ఆర్ట్స్ వంటి కోర్సులు కూడా చాలా ఉన్నాయన్నారు. ఈ ఏడాది కూడా నర్సంపేటకు మహిళా డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు. ‘మన ఊరు మన బడి’ ద్వారా అన్ని పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుతున్నట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని అన్నింటిని మూడో వంతు పాఠశాలల్లో ఇం గ్లిష్ మీడియం అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు.
లక్షా ము ప్పై వేల మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ కేజీ టు పీజీ విద్యలో నర్సంపేట నియోజకవర్గానికి మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు కావాల్సి ఉండగా ఏడు మం జూరైనట్లు చెప్పారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్ గోపి, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజినీ కిషన్, ఆర్డీవో పవన్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు శ్రీనివాసరెడ్డి, ఆర్సీవో వెంకన్న, ప్రిన్సిపాల్ బుచ్చయ్య, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్గౌడ్, ఎంపీపీ కలమ్మ పాల్గొన్నారు.