హనుమకొండ : జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు . రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతవరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. ఇందుకోసం కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-1115 ని కేటాయించినట్లు తెలిపారు. అధికారులు ఎవరూ హెడ్ క్వార్టర్లు వదిలివెళ్లరాదని, సెల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేయరాదని కలెక్టర్ ఆదేశించారు.