Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): నగర శివారులోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాలను శనివారం జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి సందర్శించారు. రెండు రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా ప్రక్రియను పరిశీలించారు.
ప్రస్తుతం ఉస్మాన్సాగర్ జలాశయం నుంచి 20 ఎంజీడీలు, హిమాయత్సాగర్ నుంచి 8 ఎంజీడీల నీటిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నీటిని ఆసిఫ్నగర్ ఫిల్టర్ బెడ్స్, గండిపేట కాండూట్పై ఉన్న వర్టికల్ నీటి శుద్ధి కేంద్రాల ద్వారా శుద్ధి చేసి.. ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ (సాంకేతిక) రవికుమార్, సీజీఎం దశరథ్రెడ్డి, సంబంధిత జీఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు.