వరంగల్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి రాష్ట్రం ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతి నిధులు, అధికారులతో శనివారం మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎన్నో చర్యలను చేపట్టిందన్నారు. రాష్ట్రం కరోనా నివారణ చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేర రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందించడం లేదని మంత్రి విమర్శించారు.
అయిన్నప్పటికి సీఎం కేసీఆర్ కొవిడ్ నివారణకు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి తెలిపారు. కరోనా సోకిన వారు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకుండా గుండె నిబ్బరంతో ఉండాలని మంత్రి కోరారు.
ఏమైనా జ్వరం, తల నొప్పి, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఉన్న వారు వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవాలన్నారు.
పాజిటివ్ వస్తే డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స చేసుకోవాలని ఆయన సూచించారు. ఆందోళన పడవద్దు. ధైర్యంగా ఉందాం.
మీకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటానని హామీనిచ్చారు. ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా నిలువాలన్నారు. ప్రతి ఒక్కరు కరోనా నివారణకు పాటుపడాలని మంత్రి పిలుపునిచ్చారు.
కరోనా రోగుల చికిత్స కోసం పాలకుర్తి ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్, బెడ్లు ఏర్పాటు చేశామని, త్వరలోనే కొడకండ్లలో ఈ సౌకర్యాన్ని విస్తరిస్తామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్
చెక్ డ్యామ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే