వరంగల్ రూరల్ :జిల్లాలోని నడికూడ మండలం నార్లాపూర్, వెంకటేశ్వర్లపల్లి గ్రామాల శివారులోని వాగుపై రూ.6.18 కోట్లు, పరకాల మండలం లక్ష్మిపురం గ్రామ శివారులో చలివాగుపై రూ. 4.98 కోట్ల వ్యయంతో చేపట్టిన చెక్ డ్యామ్ల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. సంబంధిత ఇంజినీర్లు, అధికారులతో మాట్లాడి పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు.
గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించకుండా పనులు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్
ఏప్రిల్లో ఎక్కువగా అమ్ముడుపోయిన కారు ఇదే