తిరువనంతపురం : కరోనా కేసుల కట్టడికి విధించిన లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. నియంత్రణలతో కొవిడ్-19 కేసుల సంఖ్య తగ్గడంతో పాటు వైరస్ వ్యాప్తి రేటు కూడా దిగివస్తోందని చెప్పారు. శని, ఆదివారాల్లో విధించే వారాంతపు లాక్డౌన్ కు ప్రజలు సహకరించాలని కోరారు.
వారాంతపు లాక్డౌన్ లో కేవలం నిత్యావసరాల దుకాణాలు, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఇక కేరళలో తాజాగా 14,233 పాజిటివ్ కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి 173 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 15,355 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరోవైపు కరోనా లాక్డౌన్ ను ఈనెల 16 వరకూ పొడిగించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.