ఆత్మకూరు, ఏప్రిల్ 26 : భార్య మృతిని తట్టుకోలేక భర్త 24గంటల్లోపే మృతి చెందిన ఘటన శుక్రవారం ఆత్మకూరులో జరిగింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పొగాకుల సుగుణమ్మ(70) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. కాగా, ఆమె భర్త చేరాలు(80) ఆరేళ్ల నుంచి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో భార్య మృతిచెందిన విషయం తెలియగానే తట్టుకోలేక అతడూ తనువు చాలించాడు. అన్యోన్యంగా ఉండే ఆ దంపతుల మరణంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.