పరిగి, మే 14 : బసవేశ్వరుడి ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్కుమార్ అన్నారు. బసవేశ్వరుడి జయంతి సందర్భంగా శుక్రవారం పరిగి మున్సిపల్ పరిధిలోని బసవేశ్వర స్వామి విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశంలోని లింగాయత్ సంప్రదాయ స్థాపక సాధువు బసవేశ్వర స్వామి అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ హరిప్రియ, ప్రవీణ్రెడ్డి, లింగాయత్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
వీరశైవుల ఆరాధ్యదైవం బసవేశ్వరుడు
తాండూరు, మే 14: ఆర్థిక అసమానతలను తొలగించి సాంఘిక దురాచారాలను నిర్మూలించిన వీరశైవుల ఆరాధ్యదైవం, తత్వవేత్త బసవేశ్వరుడి జయంతిని శుక్రవారం తాండూరు నియోజకవర్గంలో నిర్వహించారు. తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో కరోనా నేపథ్యంలో ఇండ్లలోనే బసవేశ్వరుడి జయంతిని నిర్వహించారు. తాండూరు పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న బసవేశ్వరుడి విగ్రహానికి వీరశైవులు పూల మాలలు వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు.
బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ
దోమ, మే14 : మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో బసవేశ్వర స్వామి జయంతిని పురస్కరించుకొని వీరశైవ లింగాయత్ సంఘ సభ్యులు బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా సంఘ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురు స్వామి మల్లెపల్లి శివరాజ్ మాట్లాడుతూ బసవేశ్వరుడి విగ్రహ ఆవిష్కరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. అయినాపూర్ గ్రామంలో సిద్దిరాములు అనే వీరశైవ భక్తుడు తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మల్లెపల్లి శివరాజ్, సతీశ్కుమార్, ఆనంద్, అశోక్ కుమార్, ఉదయ్కుమార్, సంఘమేశ్వర్, విశ్వనాథ్ పాల్గొన్నారు.
కొడంగల్, మే 14: బసవేశ్వరస్వామి జయంతిని పురస్కరించుకొని ఆయా దేవాలయాల్లో అర్చకులు పూజలు నిర్వహించారు. శుక్రవారం స్థానిక మహాదేవుని ఆలయం, నిరంజన మఠంలో స్వామి వారికి అభిషేకం, అర్చన చేశారు. మహాదేవుని ఆలయంలో స్వామివారి చిత్రపటానికి డోలారోహన చేపట్టారు.