హైదరాబాద్ : తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) బస్సుయాత్ర(KCR bus Yatra) కొనసా గుతున్నది. వరస పర్యటనలతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని(Parliament eletions) నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారంలో స్పీడ్ను పెంచి పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపు తున్నారు. కాగా, నేటితో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనున్నది. నేడు సాయంత్రం సిద్దిపేటలో (Siddipet) పర్యటించనున్నారు.
రోడ్ షోలో పాల్గొన్న అనంతరం సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభతో కేసీఆర్ ప్రచారం ముగియనున్నది. కాగా, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఏప్రిల్ 24న కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం విదితమే. కేసీఆర్ బస్సుయాత్ర తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది. అధినేత బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. కేసీఆర్కు ప్రతిచోటా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు.