కొడంగల్ : కొడంగల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి ప్రత్యేక శద్ధ చూపుతున్నారని నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల సర్పంచ్లు తెలిపారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఎమ్మెల్యేను సర్పంచ్లతో పాటు గిరిజన నాయకులు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకుంఠ ధామాలకు అప్రోచ్ రోడ్లు, నియోజకవర్గంలోని తండాల అభివృద్ధిపై అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి సీఎం దృష్టికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఏ నాయకుడు ఈ నియోజకవర్గ పరిస్థితులపై గళం విప్పలేదని, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రజా నాయకుడు ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టే అసెంబ్లీలో మాట్లాడి అభివృద్ధి పనులు, నిధుల మంజూరుపై సీఎంను కోరడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ మండల, గ్రామ అధ్యక్షులను ఎమ్మెల్యే సన్మానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ సభ్యులు, గిరిజనులు పాల్గొన్నారు.