ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
రామచంద్రాపురం, జూన్ 1: వ్యాక్సినేషన్తోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్సీపురం డివిజన్లోని బాలాజీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ డ్రైవ్ని కార్పొరేటర్ పుష్పానగేశ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. వ్యాక్సినేషన్ కేంద్రంలో 984 మంది సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు వ్యాక్సిన్ కవచంలా పనిచేస్తుందన్నారు. కరోనా కట్టడి విషయంలో సీఎం కేసీఆర్ అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలందరూ ధైర్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ బాలయ్య, ఏఎంవోహెచ్ డాక్టర్ రంజిత్సింగ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు ఆదర్శ్రెడ్డి, ప్రమోద్గౌడ్, సిబ్బంది మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.