అప్పుడప్పుడు పోలీసులు కూడా పప్పులో కాలేస్తుంటారు. తొందరపడి.. ఏ తప్పు చేయనివాళ్లను అరెస్ట్ చేస్తుంటారు. ఆ తర్వాత అసలు నిజం తెలుసుకున్నా.. అప్పటికే అరెస్ట్ అయిన వాళ్ల పరువు పోయినట్టే కదా. వాళ్లు మానసికంగా క్షోభ అనుభవించినట్టే కదా. తాజాగా అటువంటి ఘటనే ఒకటి ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
సిడ్నీకి చెందిన వున్ పుయ్ కన్నీ చోంగ్, తన కూతురు సాన్ యాన్ మెలానియె.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి లోపలేశారు. దాదాపు 4 నెలల పాటు వాళ్లను జైలులో ఉంచి.. ఆ తర్వాత వాళ్లు ఏ తప్పూ చేయలేదని విడుదల చేశారు. ఆ తల్లీకూతుళ్లు బ్రౌన్ రంగులో ఉండే జింజర్ టీ పౌడర్ను ఇంపోర్ట్ చేసుకొని వాటిని అమ్మే బిజినెస్ను స్టార్ట్ చేద్దామనుకున్నారు. దాని కోసం 25 కిలోల టీ పౌడర్ను ఆర్డర్ ఇచ్చారు.
సిడ్నీకి విమానం ద్వారా ఇంపోర్ట్ అయిన ఆ టీ పౌడర్ బ్యాగ్స్ను ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు.. డ్రగ్స్ అనుకొని పొరపాటు పడి.. వాటిని సీజ్ చేశారు. వాటిని ఆర్డర్ చేసిన తల్లీకూతుళ్లను తీసుకెళ్లి జైలులో వేశారు.
వాటి శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. తీరా ఆ శాంపిల్స్ను చెక్ చేస్తే అందులో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఆ తల్లీకూతుళ్లకు పోలీసులు, కోర్టు క్షమాపణ చెప్పి వాళ్లను వెంటనే రిలీజ్ చేశారు. చూశారా.. పోలీసులు చేసిన ఒక చిన్నతప్పిదం.. తల్లీకూతుళ్లను నాలుగు నెలల పాటు జైలు కూడు తినేలా చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ప్రతి రోజు 70 సార్లు వాంతి చేసుకుంటుంది.. ఈ మహిళకు ఉన్న జబ్బేంటో తెలుసా?
రోడ్ల మీద కరెన్సీ నోట్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం.. వైరల్ వీడియో
హలో.. నా బాయ్ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు సార్.. పోలీసులకు కాల్ చేసిన మహిళ
వార్నీ.. ఏడాది వయసు లేదు.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్గా మారిన బుడ్డది.. వైరల్ వీడియో
పెయిన్ కిల్లర్ అనుకొని ఎయిర్పాడ్ను మింగేసింది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?