మనిషికి అసలైన నేస్తం కుక్కే అంటారు. అందుకే.. కుక్కలు కూడా ఎక్కువగా మనుషులతోనే సావాసం చేస్తాయి. ఈరోజుల్లో పెట్ డాగ్ అనేది కామన్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు కుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. పెంపుడు కుక్కలను సాదడం అనేది అంత ఈజీ ఏం కాదు. ముఖ్యంగా విదేశీ జాతికి చెందిన కుక్కలు అయితే చాలా సున్నితంగా ఉంటాయి. వాటి ఫుడ్, వాటికి కావాల్సిన సౌకర్యాలు అన్నీ చూసుకోవాలి. అయినప్పటికీ.. రోజురోజుకూ పెంపుడు కుక్కల కల్చర్ పెరిగిపోతోంది. వాటి కోసం తీసుకుంటున్న కేర్ కూడా సూపర్బ్.
తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ముంబైకి చెందిన ఓ మహిళ.. తన పెంపుడు కుక్క మాల్టెస్ విమాన ప్రయాణం కోసం ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్ టికెట్లు అన్నీ కొనేసింది. దాని కోసం 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. బిజినెస్ క్లాస్లో ముంబై నుంచి చెన్నై వరకు ఆ పెట్ డాగ్.. మాల్టెస్ ఒక్కటే ప్రయాణించి చరిత్ర సృష్టించింది. సాధారణంగా ముంబై టు చెన్నై బిజినెస్ క్లాస్ టికెట్ 20 వేల వరకు ఉంటుంది.
ఎయిర్ ఇండియా విమానం ఏఐ 671.. ముంబైలో ఉదయం 9 గంటలకు టేకాఫ్ తీసుకొని.. చెన్నైకి ఉదయం 10.55 కి చేరుకుంది. జే క్లాస్ క్యాబిన్లో ఉన్న 12 సీట్లు మాత్రం కేవలం ఆ పెట్ డాగ్ కోసమే కేటాయించారు.
అయితే.. ఎయిర్ఇండియా పాలసీ ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానాల్లో జంతువులకు అనుమతి ఉంది. ఒక ప్యాసెంజర్ రెండు పెట్స్ను తనతో పాటు తీసుకెళ్లొచ్చు. వాటిని తమ క్యాబిన్లో లేదా.. కార్గోలో విమాన సిబ్బంది అడ్జెస్ట్ చేస్తారు. బిజినెస్ క్లాస్లో అయితే.. పెట్స్ను చివరి వరుసలో కూర్చోబెడతారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఐఆర్సీటీసీ ‘లేహ్-లడఖ్’ పర్యాటక ప్యాకేజీ సిద్ధం..
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర
పడిపోయిన ఆర్-వ్యాల్యూ.. మందగించిన కొవిడ్ వ్యాప్తి