రాజకీయ నేతలు అంటే ఎలా ఉంటారో తెలుసు కదా. కొందరైతే తమకేం తక్కువ అనే భావనలో ఉంటారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోరు. కానీ.. ఇంకొందరు పొలిటిషిన్లు మాత్రం చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. చాలా సింపుల్గా ఉంటారు. పెద్ద పెద్ద పదవులు ఉన్నా కూడా సింపుల్గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లిపోతుంటారు. అలాంటి రాజకీయ నాయకులు న్యూజిలాండ్ దేశంలో ఎక్కువగా ఉంటారు. అక్కడ చాలామంది ఎంపీలు, ఇతర నాయకులు సాధారణ జీవనశైలిని అవలంభిస్తారు. చివరకు న్యూజిలాండ్ ప్రధాని జాకిండా ఆర్డెన్ కూడా తన మూడు నెలల బేబీని తీసుకొని ఐక్యరాజ్యసమితి మీటింగ్కు వచ్చారు. ఆ మీటింగ్లో తన బేబీకి పాలు కూడా ఇచ్చారు. అప్పట్లో ఆ విషయంల సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
తాజాగా.. న్యూజిలాండ్కు చెందిన ఎంపీ(పార్లమెంట్ సభ్యురాలు) జూలీ అన్నె తనకు పురిటి నొప్పులు రావడంతో రాత్రి పూట.. సైకిల్ వేసుకొని ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే తనకు పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో ఆసుపత్రికి వెళ్లిన గంటకే తనకు వైద్యులు డెలివరీ చేశారు. తనకు పాప పుట్టగానే.. తను సైకిల్ మీద ఆసుపత్రికి వెళ్లిన విషయాన్ని ఫోటోలతో సహా.. జూలీ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
నిజానికి నేను నొప్పులు రావాలని సైకిల్ మీద ఆసుపత్రికి వెళ్లలేదు. సాధారణంగా.. డెలివరీ పెయిన్స్ ప్రారంభం అవుతున్నాయని సైకిల్ మీద తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆసుపత్రికి బయలుదేరా. కానీ.. సైకిల్ తొక్కుతుంటే పెయిన్స్ ఎక్కువయ్యాయి. ఆసుపత్రికి చేరుకోగానే డాక్టర్లు డెలివరీ చేశారు. ఇప్పుడు నేను, నా బిడ్డ.. ఇద్దరం క్షేమంగా ఉన్నాం. తను అప్పుడే తన నాన్న ఒడిలో హాయిగా నిద్రపోతోంది.. అంటూ జూలీ పోస్ట్లో పేర్కొన్నారు.
2018 లో కూడా జూలీ.. బైక్ మీద ఆసుపత్రికి వెళ్లి తన మొదటి బిడ్డను కన్నారు. తాజాగా సైకిల్ మీద వెళ్లడంతో న్యూజిలాండ్ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Monkey Festival : అక్కడ కోతుల పండుగే స్పెషల్ అట్రాక్షన్.. ఎందుకు జరుపుతారో తెలుసా?
ప్రపంచ పర్యాటక గ్రామం.. పోచంపల్లి!
ఇప్పటికీ ఎయిర్పోర్ట్లు లేని దేశాలు ఉన్నాయని తెలుసా?
నచ్చిన ఫుడ్ తినడం కోసం 8000 రెస్టారెంట్లు తిరిగాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
30 ఏళ్లపాటు నీటిలో ఉన్న గ్రామం.. ఇప్పుడు బయటపడింది!