Monsoon Diet : వర్షాకాలంలో ఆరోగ్యంపై జాగ్రత్త చాలా అవసరం. ఈ సీజన్లో జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వానాకాలంలో ఇమ్యూనిటీని కాపాడుకోవాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. దీంతో పాటు మనం రోజూ తినే ఆహారంలో వీటిని భాగం చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకుని రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
బొప్పాయి, లిచీ, యాపిల్, పియర్ వంటి సీజనల్ ఫ్రూట్స్ వర్షాకాలంలో ఆరోగ్యానికి మంచిది. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. అలాగే శరీరానికి అవసరమైన న్యూట్రీషియన్లను అందిస్తాయి. సీజనల్ పండ్లను ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల గట్ హెల్త్ అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
జీవక్రియను నియంత్రించడంలో వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది. మనం తినే పప్పు, సాంబార్ ఇతర కూరల్లో వెల్లుల్లిని వాడుకోవచ్చు. వెల్లుల్లితో పాటు మిరియాలు, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, పసుపు వంటి మసాల దినుసులను రోజూ కూరల్లో వేసుకోవడం మంచిది. సాధారణంగా వర్షాకాలంలో వచ్చే జలుబు, ఇతరత్రా ఫ్లూ వ్యాధుల నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి.
చేదు గుణం కలిగిన కాకరకాయ, మెంతి, వేప కూడా వర్షాకాలంలో రోగ నిరోధకశక్తిని పెంపొందించడంలో సహాయపడుతాయి. అలాగే వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిలో విటమిన్ ఏ, బీ, సీతో పాటు ఐరన్, జింక్ ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా వేపలో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతాయి.
పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచే గట్ బ్యాక్టీరియాను బలంగా చేస్తుంది. అలాగే పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఏకాలంలో అయినా సరే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో జబ్బులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి ఆహారంలో మొలకలు చాలా ముఖ్యమైనవి. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి కాపాడటంలో మొలకలు కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. ఇవి శరీరంలోని ఆక్సిజన్ లెవల్స్ను పెంచడం ద్వారా హానికలిగించే వ్యర్థాలను తొలగిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరానికి కావాల్సినంత శక్తిని అందించడంలో తేనే సహాయపడుతుంది. ఇందులో ఉండే పైటోన్యూట్రియెంట్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లబిస్తాయి. ఇవి క్యానర్ బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తుంది.
వర్షాకాలంలో నీటిని శుద్ధి చేసుకుని లేదా వేడి చేసుకుని తాగడం మంచిది. శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు మొటిమలను తగ్గించుకోవడంలో నీరు సహాయపడుతుంది. నిమ్మ, దోసకాయ, పుదీనా కలిపిన నీటిని తాగడం ద్వారా కూడా శక్తి పెంచుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఈ ఐదింటిని డైట్లో చేర్చుకుంటే రక్తహీనత మాయం..!
మధుమేహులకు శుభవార్త : పాక్లో చక్కెర లేని మామిడి పండ్లు
షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది..?
Monsoon Diet : వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? వీటిని ఆహారంగా తీసుకోండి