హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ దంపతులు, మంత్రి నిరంజన్ రెడ్డి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో తన సతీమణి రోహిణితో కలిసి ఎంపీ సంతోష్ కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు. మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని చెప్పారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిమ్స్ దవాఖానలో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కరోనా విషయంలో అప్రమత్తత ముఖ్యమని చెప్పారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనవసరమైన పనులకోసం బయటకు రాకపోవడం ఉత్తమమని చెప్పారు. ఆరోగ్యశాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
ఆ అవార్డులు శార్దూల్, భువనేశ్వర్కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి
బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం.. ఢిల్లీ, ఒడిశాలో ఎడారులను తలపిస్తున్న వీధులు
లండన్లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచే కరోనా: డబ్ల్యూహెచ్వో
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్