ఇదిపార్క్ కాదు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అందమైన హైటెక్ శ్మశానవాటిక. ఒక మాటలో చెప్పాలంటే ఇంత హైటెక్ హంగులతో నిర్మించిన ఒక శ్మశానవాటిక దేశంలో మరెక్కడా లేదు. ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ ఫతుల్లాగూడలో దీన్ని నిర్మించారు. ఆరున్నర ఎకరాల్లో మూడు మతాల వారికి ఒకే చోట అత్యక్రియలు చేసేందుకు ముక్తిఘాట్ పేరుతో ఈ శ్మశానవాటికను ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలను లైవ్లో వీక్షించేలా ఏర్పాట్లు చేయడం విశేషం. ఆధునిక శ్మశానవాటికను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందమైన, హైటెక్ శ్శశానవాటిక స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసుకోవాలనుందా?.. మరేందుకు ఆలస్యం వెంటనే ఈ క్రింది వీడియోను క్లిక్ చెయ్యండి మరిన్ని విశేషాలను తెలుసుకోండి.
ముక్తిఘాట్.. హైటెక్ స్మశానవాటిక వీడియో