దామెర, ఏప్రిల్ 25 : విజయవాడ-నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గురువారం రైతులు ధర్నాకు దిగారు. మొగుళ్లపల్లి, గట్లకానిపర్తి, రంగాపురం, సీతారాంపురం, దుర్గంపేట, వెల్లంప ల్లి, పులుకుర్తి, ఊరుగొండ గ్రామాలకు చెందిన రైతులు ఊరుగొండ-పసరగొండ క్రాస్ వద్ద కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు.
దీంతో జాతీయ రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయా యి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను రోడ్డు పక్కకు తప్పించేందుకు యత్నించగా పోలీసులు, రైతులకు వాగ్వాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన లక్కం వేణు (45) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన పోలీసులు వేణును చికిత్స కోసం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.