నిజామాబాద్ : జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గడిచిన వారం రోజులుగా గోదావరిలోకి వరద భారీగా నెలకొంది. నాలుగు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరిలో ప్రవాహం ఎంత మాత్రం తగ్గలేదు. శుక్రవారం కందకుర్తి పుష్కర్ ఘాట్ వద్ద ఓ యువకుడు పిండ ప్రదానం కోసం వచ్చి గోదావరి ఉధృతిలో కొట్టుకుపోసాగడు.
క్షణాల్లో కళ్ల ముందు నీళ్లలో మునిగిపోతుండగా గమనించిన స్థానిక మత్స్యకారులు రంగంలోకి దిగారు. స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు గోదావరి పరీవాహక ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు స్థానికంగా ఉన్న మరికొంత మంది మత్స్యకారులను అప్రమత్తం చేసి యువకుడును కాపాడే ప్రయత్నం చేశారు.
రెండు తెప్పలను తీసుకుని ప్రవాహం మధ్యలోకి వెళ్లి గజ ఈతగాళ్లు యువకుడిని తెప్ప మీద కూర్చోపెట్టుకొని తీసుకువచ్చారు. అప్పటికే పుష్కర ఘాట్ వద్ద తాడుతో సిద్ధంగా ఉన్న పోలీసులు యువకుడిని క్షేమంగా బయటకు తెచ్చారు.
గోదావరి ప్రవాహంలో చిక్కుకున్న యువకుడు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన సంజయ్ (27) గా పోలీసులు వెల్లడించారు. గోదావరి నదిలో పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో సందర్శకులు నదీ పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
మళ్లీ పెట్రో మంట.. హైదరాబాద్లో సెంచరీకి చేరువలో డీజిల్ ధర
Road accident | జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి
IPL 2021 | ప్లేఆఫ్స్ రేసులో ఎవరెవరు.. ముంబై, కోల్కతా ఢీ అంటే ఢీ