న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశీయ పెట్రోలియం కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.89కి చేరగా.. డీజిల్ ధర రూ.90.17కి పెరిగింది.
తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి రూ.107.95కు, లీటర్ డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.97.84కు చేరింది. ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.106కు చేరగా, డీజిల్ ధర 33 పైసలు పెరిగి రూ.99.08కు పెరిగింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా రాజస్థాన్లోని జైపూర్లో ఉన్నాయి. జైపూర్లో పెట్రోల్ ధర రూ.108.47, డీజిల్ రూ.99.08గా ఉన్నది. ఇక ప్రధాన నగరాలైన కోల్కతాలో పెట్రోల్ రూ.102.17, డీజిల్ రూ.92.97, చెన్నైలో పెట్రోల్ రూ.99.36, డీజిల్ రూ.94.45, బెంగళూరులో పెట్రోల్ రూ.105.44, డీజిల్ రూ.95.70కు చేరాయి.