జోగులాంబ గద్వాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 44 వ జాతీయ రహదారిపై ఉండవల్లి గ్రామ శివారులో వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు దగ్గర ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు..మానవపాడుకు చెందిన నరసింహులు, అనంత రెడ్డి కలిసి బైక్ పై కర్నూల్ వైపు వెళ్తున్నారు.
హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు స్పీడ్గా వెళ్తున్న బొలెరో వాహనం బైక్ను వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహులు (35) అక్కడికక్కడే మృతి చెందగా.. అనంత రెడ్డి కాలు విరిగింది. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మళ్లీ పెట్రో మంట.. హైదరాబాద్లో సెంచరీకి చేరువలో డీజిల్ ధర
ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాల విడుదల
IPL 2021 | ప్లేఆఫ్స్ రేసులో ఎవరెవరు.. ముంబై, కోల్కతా ఢీ అంటే ఢీ