కామారెడ్డి: పట్టణంలో దారుణం జరిగింది. పట్టణంలోని బీర్కూర్ పోచమ్మ కాలనీలో ఓ మహిళ తన పిల్లలతో కలిసి కట్టుకున్న భర్తను హత్యచేసింది. నారం నారాయణ అనే వ్యక్తి భార్య, కుమారుడు, కూతురుతో కలిసి బీర్కూర్ పోచమ్మ కాలనీలో నివసిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి నిద్రిస్తున్న నారాయణను.. ఆమె తన కొడుకు, కూతురుతో కలిసి తలపై రాయితో కొట్టి హత్య చేసింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భూ తగాదాలతోనే హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి