రాజన్న సిరిసిల్ల : రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వేములవాడ రాజన్న ఆలయం సామాన్యులకు అండగా ఉందన్నారు. వేములవాడ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి వేములవాడన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోనే ఎక్కువ మంది భక్తులు రాజన్నను దర్శించుకుంటారని మంత్రి తెలిపారు. యాదాద్రి తర్వాత రాజన్న ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. భక్తులకు గదుల కొరత ఉండడంతో కొత్తగా 60 వసతి గదులు నిర్మించామని మంత్రి తెలిపారు. కరోనా సమయంలో సైతం రాజన్న ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు.
అలాగే మంత్రి కేటీఆర్ జిల్లాను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. కరొనా కారణంగా కొత్త ఆదాయం తగ్గింది. అయిన సంక్షేమ మాత్రం ఆగడం లేదన్నారు. దళితబంధు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. రాజన్న ఆలయానికి వీటీడీఏ నుంచి ఇప్పటి వరకు రూ.100 కోట్లు పెట్టాం. మరో రూ.50 కోట్లు బడ్జెట్లో కేటాయించామన్నారు. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అందుకే 30 ఎకరాల ల్యాండ్ ను ప్రైవేట్ నుంచి తీసుకున్నారు.
రేపు రాబోయే రోజుల్లో శృంగేరి పీఠం ఇచ్చిన నమునా ప్రకారం అబివృద్ధి జరిగుతుందన్నారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ..వేములవాడలో ఇప్పటికే రూ.280 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఆలయ అభివృద్ధి పై త్వరలోనే మంత్రి కేటీఆర్ తో సమీక్ష సమావేశం ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి..
Team India: ఇండియన్ టీమ్కు గుడ్బై చెప్పనున్న కోచ్ రవిశాస్త్రి!
కోల్కతా కరోనా రోగుల్లో మూడోంతులు టీకా తీసుకున్న వారే
రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ